యాప్నగరం

ఆస్తి కోసం భర్తనే చంపేసింది

ఆస్తులు పచ్చని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపుతున్నాయి. ఆస్తి వస్తుందనే ఆశతో సొంతవాళ్లను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు.

Samayam Telugu 25 Mar 2018, 10:59 am
ఆస్తులు పచ్చని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపుతున్నాయి. ఆస్తి వస్తుందనే ఆశతో సొంతవాళ్లను కూడా చంపేయడానికి వెనుకాడటం లేదు. నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటన స్థానికంగా కలకలంరేపింది. లింగాల మండలం మల్లోని చెర్వు తండాకు చెందిన తిరుపతమ్మకు వంగూరు మండలం అన్నారంకు చెందిన రాములతో వివాహయ్యింది. అయితే అతడు అత్తగారింటికి ఇల్లరికం వచ్చాడు. రాములు మద్యానికి బానిసయ్యాడు. రోజూ భార్యాభర్తలు గొడవపడేవారు. అలాగే ఆస్తి విషయంలో కూడా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఐదు రోజుల క్రితమే రాములు కూతురికి పెళ్లి చేశాడు.
Samayam Telugu Murder


రాత్రి ఇంటి బయట పడుకున్న రాములు... ఉన్నట్టుండి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. షాకైన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.... తిరుపతమ్మ తన చెల్లెలు, మరిదితో కలిసి హత్య చేసినట్లు తేల్చారు. ఆస్తి తగాదాలతో ఆమె చంపినట్లు రాములు తమ్ముడు ఆరోపిస్తున్నాడు. మృతుడికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఈ హత్య వారిద్దరూ అనాథలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.