యాప్నగరం

చెప్పుతో కొట్టిన భార్య.. అవమానంగా భావించి భర్త ఆత్మహత్య

కట్టుకున్న భార్య అందరి ముందు చెప్పుతో కొట్టడంతో.. అవమానంగా భావించిన ఆ భర్త తన ప్రాణాలు తీసుకున్నాడు. కృష్ణాజిల్లా చాట్రాయిలో ఈ ఘటన జరిగింది. చాట్రాయికి చెందిన కిషోర్‌కు సి గుడిపాడుకు చెందిన శ్యామలతో ఏడాది క్రితం వివాహమయ్యింది. కాని

Samayam Telugu 22 Jun 2018, 2:14 pm
కట్టుకున్న భార్య అందరి ముందు చెప్పుతో కొట్టడంతో.. అవమానంగా భావించిన ఆ భర్త తన ప్రాణాలు తీసుకున్నాడు. కృష్ణాజిల్లా చాట్రాయిలో ఈ ఘటన జరిగింది. చాట్రాయికి చెందిన కిషోర్‌కు సి గుడిపాడుకు చెందిన శ్యామలతో ఏడాది క్రితం వివాహమయ్యింది. కాని కుటుంబ కలహాలతో వారానికేవిడిపోయి విడాకులు కూడా తీసుకున్నారట. ఈ మధ్య కిషోర్ తనను వేధిస్తున్నాడంటూ శ్యామల పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో అతడ్ని పోలీసులు స్టేషన్‌కు పిలిచారు.
Samayam Telugu Chatrai


కిషోర్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి.. మరోసారి ఆమె జోలికి వెళ్లనని పేపర్ మీద సంతకం కూడా చేయించారు. తర్వాతి రోజు మళ్లీ ఇద్దర్ని పిలిచి మాట్లాడారు. ఇరు కుటుంబాలకు సంబంధించిన కొద్దరు వ్యక్తులు కూడా వెళ్లారట. ఆ సమయంలో కిషోర్‌ను శ్యామల చెప్పుతో కొట్టింది. అందరి ముందు తనను కొట్టడంతో అతడు అవమానంగా భావించాడు. గురువారం తన ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. పోలీస్ స్టేషన్‌లో జరిగిన పరిణామం తనను ఎంతో బాధించిందంటూ సూసైడ్ నోట్ రాశాడు.

ఇదిలా ఉంటే కిషోర్ మరణానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలంటూ బంధువులు పోలీస్ స్టేషన్ ముందు మృతదేహంతో ధర్నాకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ మృతుడి బంధువులకు సర్థిచెప్పారు. తర్వాత కిషోర్ తండ్రి.. తన కుమారుడి చావుకు శ్యామల కారణమని కేసు నమోదు చేయాలని పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.