యాప్నగరం

ఈ నెల 30న వంచన దినంగా పాటిస్తున్న వైసీపీ

ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది వైసీపీ. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌తో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో హోదా ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు.

Samayam Telugu 23 Apr 2018, 2:58 pm
ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది వైసీపీ. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌తో ఆ పార్టీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో హోదా ఉద్యమం, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 30న వైసీపీ వంచన దినం పేరుతో భారీ ఆందోళనా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు... విశాఖలో జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పాదయాత్రలో ఉన్న జగన్, పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతారు.
Samayam Telugu Jagan


ప్రత్యేక హోదా వద్దని నాలుగేళ్లుగా చెప్పి... ఇప్పుడు దీక్షల పేరుతో చంద్రబాబు హడావిడి చేయడం విడ్డూరంగా ఉందన్నారు వైసీపీ నేతలు. ఈ నెల 30న తిరుపతిలో మరోసారి నిరసన సభ పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అందుకే అదే రోజు ఈ వంచన దినం పాటిస్తున్నామన్నారు. ఈ భేటీలో పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌తో పాటూ పార్టీ ఎంపీలతో పాటూ ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. జగన్‌ పాదయాత్ర మే 6 నాటికి 2వేల కిలో మీటర్లు చేరుతుండటంతో... రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై కూడా ఈ భేటీలో చర్చించారు. ఈ నెల 26న సమావేశమై దీనిపై నిర్ణయించాలని జగన్‌ సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.