యాప్నగరం

లేనిపోని ఆరోపణలు చేసే వారిపై కేసులు

ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీలపై కేసులు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు

Samayam Telugu 21 Apr 2017, 5:19 pm
ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీలపై కేసులు తప్పవని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. లేనిపోని ఆరోపణలు చేసే ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెట్టేందుకు వెనుకాడవద్దని ఆయన మంత్రులుకు సూచించారు. శుక్రవారం నగర శివారు కొంపల్లి టీఆర్ఎస్ ప్లీనరీ జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ మళ్లీ పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Samayam Telugu will file cases against who make false allegations says kcr
లేనిపోని ఆరోపణలు చేసే వారిపై కేసులు


‘రైతే రాజు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. వరంగల్ లో సభ ముగిశాక శాసన సభ ఏర్పాటు చేసి కల్తీ విత్తనాలు తయారీదారులు, అమ్మకందారులపై ఉక్కుపాదం మోపుతాం. కల్తీవిత్తనాల వినియోగించి నష్టపోయిన రైతులకు ఆ విత్తనాల తయారీదారుల నుంచే నష్టపరిహారం చెల్లించేలా చట్టం తెస్తాం.

ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేసేవారిపైనా చర్యలు తీసుకుంటాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మార్కెట్ కమిటీల నియామకాల్లో రిజర్వేషన్లు అమలు చేశాం. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాం.

ఎస్సీ,ఎస్టీ వర్గాలకు చెందిన ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాం. దళిత ఆడపిల్లలు పట్టణాల్లో చదువుకునేందుకు వస్తే కొంతమంది కులతత్వం ఉండే మూర్ఖులు వాళ్ల గదులు అద్దెకివ్వడం లేదని నా దృష్టికి వచ్చింది. అందుకే దళిత మహిళలకు 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ప్రారంభించాం. గిరిజన మహిళలకు ప్రారంభిస్తాం. ప్రతి రెవెన్యూ డివిజన్ లో ఒక రెసిడెన్షియల్ కళాశాల ప్రారంభిస్తాం.

కష్టం చేస్తే తెలుస్తుంది. అవాకులు, చవాకులు పేలుతున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నా. గత తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ హయంలో మొత్తం రాజకీయ నాయకత్వమే దోపిడిలో వాటా పంచుకునేవి. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం రాకుండా గండి కొట్టేవి.

కాంగ్రెస్ హయంలో ఇసుక వ్యాపారంలో విచ్చిల విడిగా అక్రమాలు జరిగాయి. ఇసుక వ్యాపారంలో కాంగ్రెస్ రూ.కోట్ల అవినీతికి పాల్పడింది. టిఆర్ఎస్ హయంలో ఇసుక పాలసీతో రూ.460 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇది మా చిత్తశుద్ధి.

మేం అవినీతి రహితంగా పనిచేస్తున్నాం. అవినీతిపై యుద్ధం చేస్తున్నాం. మీ అవాకులు, చెవాకులు ఇప్పటి వరకు సహించాం. అనవసరమైన ఆరోపణలు చేస్తే..ప్రభుత్వంలోని ఏ శాఖపైనా అయినా ఆరోపణలు చేస్తే..వెంటనే కేసులు పెట్టాల్సిందిగా మంత్రులకు సూచిస్తున్నా’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

భారతదేశంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.

ప్లీనరీని సక్సెస్ చేసినందుకు అందరికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.