తనను ప్రేమించి, వేరొకరిని పెళ్లాడిన యువకుడిపై యాసిడ్ దాడి చేసింది ప్రేయసి. ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు ప్రియుడు. గుంటూరులోని పెదకాకానిలో ఈ ఘటన జరిగింది. పాములపాడు గ్రామానికి చెందిన ఇలియాస్ (24), హిమబిందు (21) ప్రేమించుకున్నారు. అయితే ఇలియాస్ ఆమెతో ఒకవైపు ప్రేయాయణం నడుపుతూనే మరో వైపు ఇంట్లో వాళ్లు చూసిన సంబంధానికి ఓకే చెప్పేశాడు. సోమవారం పెళ్లనగా హిమబిందుకు ఆదివారం ఆ విషయం తెలిసింది. వెంటనే ఇలియాస్ అన్నను కలిసి తన సంగతేంటని అడిగింది. ఆయన హిమబిందుకు నచ్చజెప్పి పంపించాడు. సోమవారం ఇలియాస్ పెళ్లయిపోయింది. ఆ రోజున ఏ గొడవ పెట్టలేదు హిమబిందు. ఆ మరుసటి రోజు ఇలియాస్ ఫోన్ చేసి చివరగా ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుందాం రమ్మని పిలిచింది.
పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామంలోని తన స్నేహితుని ఇంటికి రమ్మని చెప్పింది. ఇలియాస్ తన స్నేహితుడితో కలిసి ఆ ఇంటికి వెళ్లాడు. స్నేహితుడు ఇంటి బయటే ఉండిపోగా ఇలియాస్ ఒక్కడే లోపలికి వెళ్లాడు. రెండు గంటల పాటూ లోపలే ఉన్నాడు. తరువాత అరుచుకుంటూ బయటికి వచ్చాడు. వెంటనే అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు స్నేహితుడు. మాట్లాడలేక ఒక పేపర్ పైనా తనపై హిమబిందు యాసిడ్ దాడి చేసిందని, నోట్లో యాసిడ్ పోసిందని రాశాడు. కాసేపటికే చనిపోయాడు. పరారీలో ఉన్న హిమబిందును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు కూడా కాళ్లపై, చేతులపై యాసిడ్ పడి గాయాలైనట్టు సమాచారం. ఇలియాస్ ను పెళ్లి చేసుకున్న నవ వధువు... ఒక్కరోజులోనే భర్తని కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
పెదకాకాని మండలంలోని వెనిగండ్ల గ్రామంలోని తన స్నేహితుని ఇంటికి రమ్మని చెప్పింది. ఇలియాస్ తన స్నేహితుడితో కలిసి ఆ ఇంటికి వెళ్లాడు. స్నేహితుడు ఇంటి బయటే ఉండిపోగా ఇలియాస్ ఒక్కడే లోపలికి వెళ్లాడు. రెండు గంటల పాటూ లోపలే ఉన్నాడు. తరువాత అరుచుకుంటూ బయటికి వచ్చాడు. వెంటనే అతడిని దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు స్నేహితుడు. మాట్లాడలేక ఒక పేపర్ పైనా తనపై హిమబిందు యాసిడ్ దాడి చేసిందని, నోట్లో యాసిడ్ పోసిందని రాశాడు. కాసేపటికే చనిపోయాడు. పరారీలో ఉన్న హిమబిందును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు కూడా కాళ్లపై, చేతులపై యాసిడ్ పడి గాయాలైనట్టు సమాచారం. ఇలియాస్ ను పెళ్లి చేసుకున్న నవ వధువు... ఒక్కరోజులోనే భర్తని కోల్పోవడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.