యాప్నగరం

మొఖం చాటేసిన ప్రియుడు.. పురుగుల మందు తాగి, ఆపై ఉరి

ప్రేమించిన వ్యక్తి మొహం చాటేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మొదట పురుగుల మందు తాగి, మరణించనేమో అనే అనుమానంతో ఆపై ఉరేసుకుంది.

Samayam Telugu 31 Aug 2018, 1:04 am
ప్రేమించిన వ్యక్తి మొహం చాటేశాడని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మొదట పురుగుల మందు తాగి, మరణించనేమో అనే అనుమానంతో ఆపై ఉరేసుకుంది. అనంతపురంలో గురువారం (ఆగస్టు 30) మధ్యాహ్నం ఈ విషాదం చోటుచేసుకుంది. అనంతపురం సమీపంలోని చియ్యేడు గ్రామానికి చెందిన మీనాక్షి, అదే గ్రామానికి చెందిన దుర్గమయ్య గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే సామాజిక వర్గం కావడంతో పెళ్లి కూడా చేసుకుంటారని బంధువులు భావించారు.
Samayam Telugu suicide


అయితే.. ఇటీవల దుర్గమయ్య మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న మీనాక్షి ఇదే అంశంపై దుర్గమయ్యను నిలదీసింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. అనంతరం మీనాక్షిని రెండు రోజుల్లో పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో దుర్గమయ్య చెప్పాడు.

కానీ, రెండు రోజులుగా దుర్గమయ్య ఆచూకీ దొరకడంలేదు. అతడు చెప్పాపెట్టకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన మీనాక్షి పురుగుల మందు తాగింది. అయినా చనిపోనని భావించి ఇంట్లో ఉరి వేసుకుని తనువు చాలించింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీనాక్షి ఈ దారుణానికి ఒడిగట్టింది. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే లోపు ఆమె విగతజీవిగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు మీనాక్షి మృతదేహాన్ని కిందకు దింపి, పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మీనాక్షి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుర్గమయ్య కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.