కన్నకూతురినే వ్యభిచార కూపంలోకి నెట్టింది ఓ మహాతల్లి. డబ్బు మోజులో పడి తన రెండో భర్తతో కలసి అబంసుబం తెలియని 14 ఏళ్ల కూతురితో వ్యభిచారం చేయించింది. ఈ ఉదంతాన్ని విజయవాడ నగరంలోని నున్న పోలీసులు ఛేదించారు. బాలికను కాపాడి తల్లితో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. ఒకప్పుడు ఆశా వర్కర్గా పనిచేసిన ఆ మహిళ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతోంది. పోలీసుల కథనం ప్రకారం..
నున్నలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో గొట్టం మణి తన మైనర్ కూతురితో నివాసముంటోంది. మణి గతంలో కొంతకాలం ఆశావర్కర్గా పనిచేసింది. మొదటి భర్తని వదిలేసి.. మల్లికార్జునరావు అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొంది. కూతురిని ఏడో తరగతి తరవాత చదువు మాన్పించి.. వ్యభిచారకూపంలోకి లాగేసింది. కన్నకూతురు పాలిట కొరివిగా మారి, కాల్చుకుతినడం మొదలుపెట్టింది. రెండో భర్తతో కలసి కన్నకూతురిని చిత్రహింసలు పెట్టింది. ఆ బాధలు తట్టుకోలేక గత జూన్ 5వ తేదీన బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది.
రైలులో గూడూరు రైల్వేస్టేషన్కు చేరుకుంది. అక్కడ దిక్కు తోచక అటూఇటూ తిరుగుతుండటంతో, శ్రీకాళహస్తికి చెందిన లీలాకృష్ణ ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. బాలికను అతనితో పాటే తీసుకెళ్లాడు. కొద్దిరోజుల తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు తన కుమార్తె కనిపించడం లేదంటూ గౌతమణి.. నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు క్రమంలో పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించారు. బాలిక ఫిర్యాదుతో తల్లిని, ఆమె రెండో భర్తని నిర్భయచట్టం కింద అరెస్టు చేశారు. మైనారిటీ తీరని బాలికను పెళ్లిచేసుకున్నందుకు లీలాకృష్ణపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసినట్టు ఏసీపీ శ్రావణి చెప్పారు. బాలికను ఓ వసతి గృహంలో ఉంచామన్నారు.
నున్నలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో గొట్టం మణి తన మైనర్ కూతురితో నివాసముంటోంది. మణి గతంలో కొంతకాలం ఆశావర్కర్గా పనిచేసింది. మొదటి భర్తని వదిలేసి.. మల్లికార్జునరావు అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొంది. కూతురిని ఏడో తరగతి తరవాత చదువు మాన్పించి.. వ్యభిచారకూపంలోకి లాగేసింది. కన్నకూతురు పాలిట కొరివిగా మారి, కాల్చుకుతినడం మొదలుపెట్టింది. రెండో భర్తతో కలసి కన్నకూతురిని చిత్రహింసలు పెట్టింది. ఆ బాధలు తట్టుకోలేక గత జూన్ 5వ తేదీన బాధితురాలు ఇంటి నుంచి పారిపోయింది.
రైలులో గూడూరు రైల్వేస్టేషన్కు చేరుకుంది. అక్కడ దిక్కు తోచక అటూఇటూ తిరుగుతుండటంతో, శ్రీకాళహస్తికి చెందిన లీలాకృష్ణ ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. బాలికను అతనితో పాటే తీసుకెళ్లాడు. కొద్దిరోజుల తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. మరోవైపు తన కుమార్తె కనిపించడం లేదంటూ గౌతమణి.. నున్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాఫ్తు క్రమంలో పోలీసులు బాలిక ఆచూకీ గుర్తించారు. బాలిక ఫిర్యాదుతో తల్లిని, ఆమె రెండో భర్తని నిర్భయచట్టం కింద అరెస్టు చేశారు. మైనారిటీ తీరని బాలికను పెళ్లిచేసుకున్నందుకు లీలాకృష్ణపై పోస్కో చట్టం కింద కేసు నమోదుచేసినట్టు ఏసీపీ శ్రావణి చెప్పారు. బాలికను ఓ వసతి గృహంలో ఉంచామన్నారు.