యాప్నగరం

హైదరాబాద్: ఎయిర్‌పోర్టులో మహిళ మిస్సింగ్ మిస్టరీ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ మిస్సింగ్ మిస్టరీగా మారింది. జైపూర్ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఆమె తర్వాత కనిపించకుండా పోవడం కలకలంరేపింది. సాయి ప్రసన్న అనే మహిళ భర్తతో పాటూ జైపూర్‌లో ఉంటోంది.

Samayam Telugu 8 Jun 2018, 11:41 am
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ మిస్సింగ్ మిస్టరీగా మారింది. జైపూర్ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఆమె తర్వాత కనిపించకుండా పోవడం కలకలంరేపింది. సాయి ప్రసన్న అనే మహిళ భర్తతో పాటూ జైపూర్‌లో ఉంటోంది. ఆమెను భర్త ఎయిర్‌పోర్టులో దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించాడు. శంషాబాద్‌ నుంచి ఆమెను తీసుకెళ్లేందుకు.. తండ్రితో పాటూ తమ్ముడు కూడా వచ్చారు. కాని ప్రసన్న మాత్రం ఫ్లైట్ దిగగానే తమ్ముడికి ఫోన్ చేసిందట. తాను క్యాబ్ మాట్లాడుకొని వెళుతున్నట్లు చెప్పగా.. అతడు వెంటనే దిగాలని ఆమెకు చెప్పాడు. వెంటనే ఆమె ఫోన్ కట్ చేయగా.. మళ్లీ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.
Samayam Telugu Prasanna


లక్ష్మీ ప్రసన్న ఇచ్చిన సడన్ ట్విస్ట్‌తో తండ్రి, తమ్ముడు షాక్ తిన్నారు. వెంటనే విషయాన్ని ఆమె భర్తకు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రసన్న భర్త మాత్రం తన భార్య కనపడకుండా పోవడానికి ఖమ్మంకు చెందిన మోహన్‌రావు అనే వ్యక్తి కారణమని చెబుతున్నారట. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎయిర్‌పోర్టులో సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.