యాప్నగరం

ముగ్గురు పిల్లలతో సహా కాలువలో దూకిన మహిళ.. ఇద్దరు చిన్నారులు మృతి

ముగ్గురు పిల్లలతో సహా సాగర్ కాలువలోకి దూకి మహిళ.. ఇద్దరు చిన్నారులు మృతి.. మరొకరి గల్లంతు.. మహిళ పరిస్థితి విషమం..

Samayam Telugu 5 Oct 2018, 1:47 pm
నల్గొండ జిల్లాలో విషాద ఘటన జరిగింది. అనుముల మండలం హాలియా సమీపంలో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో సహా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు.. వారిని కాపాడే ప్రయత్నం చేశారు. తల్లితో పాటూ ఇద్దరు పిల్లల్ని బయటకు తీయగా.. మరో పిల్లవాడు కాలువలో కొట్టుకుపోయాడు. ఆ బాలుడి కోసం గాలిస్తున్నారు. ఇటు ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు.
Samayam Telugu Suicide..


ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు పిల్లలు చనిపోగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. మహిళ, పిల్లలు పెద్దవూర పోలీ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మోహన్ భార్య స్వాతి.. పిల్లలు సాత్విక, మిథున శ్రీ, భగవంత్‌లుగా గుర్తించారు. వీరి ఆత్మహత్యాయత్నానికి కారణాలు ఇంకా తెలియలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.