యాప్నగరం

తన ఇద్దరి కుమార్తెలతో సహా రైలు కిందపడి తల్లి ఆత్మహత్య

కుటుంబకలహాలతో ఓ మహిళ రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. తాను బలవన్మరణానికి పాల్పడటమే కాదు, అభంశుభం తెలియని తన ఇద్దరి చిన్నారులను కూడా చంపుకుంది.

Samayam Telugu 19 Sep 2018, 11:27 am
ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో.. ఏమో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. హృద‌యవిదారకమైన ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. పార్వతీపురం పట్టణంలోని బెలగాం రైల్వేస్టేషన్‌ వద్ద బుధవారం ఉదయం తల్లీకూతుళ్లు రైలు కింద పడి తనువుచాలించారు. ఈ ఘటనలో ముగ్గురి మృతదేహాలు ముక్కలు ముక్కలుగా తెగిపడటంతో చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను పార్వతీపురం బోర వీధికి చెందిన శివపుకుమారి, రితిక(6), యామిని(4)గా గుర్తించారు. బుధవారం ఉదయం తన కుమార్తెలతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చిన శివకుమారి, కదలుతున్న రైలు కిందకు వారితోపాటు దూకేసింది. దీంతో రైలు వారిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
Samayam Telugu రైలు కిందపడి ఆత్మహత్య


ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించి, వారి బంధువులకు సమాచారం అందించారు. గత మార్చిలోనూ ఇదే విధంగా ఓ తల్లి తన కుమార్తెలతో కలిసి గరివిడి రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకుంది. భర్తతో గొడవపడి ఆమె పిల్లల్ని రైలు కిందకు తోసి తాను కూడా వారితోపాటు దూకి తనువు చాలించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.