యాప్నగరం

అటల్‌జీ మరణ వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా: జగన్

భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Samayam Telugu 16 Aug 2018, 9:14 pm
భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్‌ బిహారీ తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. తీవ్ర విషాదంతో ఆయన చేసిన సేవలను స్మరించుకొంటున్నారు. మాజీ ప్రధాని మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు. వాజ్‌పేయి మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
Samayam Telugu జగన్


‘మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాను. బాధాతప్త హృదయంతో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా ’ అంటూ ట్వీట్ చేశారు జగన్.

కాగా.. వాజ్‌పేయి అంత్యక్రియలను రేపు (ఆగస్టు 17న) సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్నారు. అటల్ భౌతికకాయాన్ని రేపు ఉదయం 9 గంటల వరకు న్యూఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గంలో ఉన్న ఆయన నివాసంలో ఉంచుతారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం బీజేపీ కేంద్ర కార్యాలయంలో వాజ్‌పేయి భౌతికకాయాన్ని ఉంచుతారు. అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.