యాప్నగరం

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి!

ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

TNN 6 Nov 2017, 5:17 pm
ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే జగన్ చేపట్టిన 'ప్రజా సంకల్ప యాత్ర'లో అపశృతి చోటు చేసుకుంది. సీకే దిన్నెకు చెందిన వెంకటరమణ అనే కార్యకర్త గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న జగన్... వెంకటరమణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. ఈ ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి వైయస్ సమాధి వద్ద నివాళి అర్పించిన అనంతరం, బహిరంగసభలో ప్రసంగించి, పాదయాత్రను జగన్ ప్రారంభించారు. ఆరు నెలలపాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మేర కొనసాగనుంది.
Samayam Telugu ycp follower died heart attack at jagan padayatra
జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి!


‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర ప్రారంభ సభలో జగన్ ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబు హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆయన విధానాలతో వ్యవసాయ రంగం అతలాకుతలం అయ్యిందని విమర్శించారు. రైతుల విషయంలో చంద్రబాబు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేశారని, కనీసం ఇన్‌పుట్ సబ్సిడీలకు దిక్కులేకుండా పోయిందని జగన్ అన్నారు. రైతాంగ సమస్యల మీద కనీసం ఒక్కసారి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించే సమయం చంద్రబాబుకు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. బాబు హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని.. రాష్ట్రం ఖాతాలోని అప్పుడు రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరాయని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.