యాప్నగరం

జనసేన కార్యకర్తలపై వైసీపీ రాళ్ల దాడి.. మహిళకు గాయాలు!

గుంటూరులోని ఏటీ అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడినట్టు ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పించడంతో కలకలం రేగింది.

Samayam Telugu 24 Feb 2019, 10:19 am
గుంటూరులో జనసేన కార్యకర్తలపై శనివారం రాత్రి రాళ్లదాడి జరిగింది. నగరంలోని ఏటి అగ్రహారంలో జనసేన ప్రచార రథాలపై జరిగిన దాడితో కలకలం రేగింది. ఏటి అగ్రహారంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌ ప్రచార రథాలపై అల్లరి మూకలు రాళ్లు రువ్వాయి. ఈ దాడిలో ఇద్దరు మహిళా కార్యకర్తలు గాయపడ్డారు. తమపై రాళ్లు రువ్వింది వైసీపీ కార్యకర్తలేనని జనసేన ఆరోపించింది. వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో మహిళా కార్యకర్త ధనలక్ష్మి గాయపడ్డారు. రాత్రి 10.30 గంటల సమయంలో ఆమెతోపాటు మరికొందరు మహిళలు కళాజాత నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగిందని జనసేన నేతలు తెలిపారు. వైసీపీ రాళ్లదాడిలో గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. వైసీపీ కార్యకర్తలే రాళ్లు రువ్వారంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Samayam Telugu janasena


ఈ దాడి గురించి తెలుసుకున్న మాజీ మంత్రి, జనసేన నేత రావెల కిషోర్‌బాబు, జిల్లా సమన్వయకర్త మాధా రాధ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి గాయపడిన మహిళను పరామర్శించారు. పదిహేను రోజుల కిందట గుంటూరులోని జనసేన కార్యాలయంపై కూడా గుర్తుతెలియని దుండగులు బీరు సీసాలతో దాడి చేశారు. కార్యాలయం అద్దాలు ధ్వంసం చేయడమే కాకుండా, అందులోని సిబ్బందిపై కూడా బాటిల్స్ విసిరి పారిపోయారు. కార్యాలయం సమీపంలో మద్యం సేవించిన దుండగులు, అర్ధరాత్రి దాడిచేసినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో వెల్లడయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.