యాప్నగరం

రోజా ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం!

వైసీపీ అధినేత రోజా ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైంది.

Samayam Telugu 29 Mar 2018, 10:05 am
తిరుపతి నుంచి హైదరాబాదు వస్తున్న ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఇందులో వైసీపీ నేత, ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. విమానం ల్యాండింగ్ సమయంలో టైరు పేలడంతో మంటలు ఏర్పడ్డాయని, దీంతో విమానాయన సిబ్బంది హుటాహుటిన విమానం వద్దకు చేరుకుని ఫైరింజిన్లతో మంటలు ఆర్పినట్లు తెలిసింది.
Samayam Telugu 11223311


రోజా తిరుపతి విమానాశ్రయం నుంచి ఇండిగో 6E 7117 విమానంలో రాత్రి 8.55 గంటలకు హైదరాబాదుకు బయల్దేరారు. హైదరాబాదులోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాత్రి 10.25 గంటలకు ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది.

ఈ ప్రమాదం టైరు పేలడం వల్ల చోటుచేసుకుందా? లేదా మరేదన్నా కారణంతోనా అనేది పూర్తిగా తెలియలేదు. దీనిపై విమానాశ్రయం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం తెలియలేదు. కడపటి వార్తలు అందేసరికి ప్రయాణికులంతా ఇంకా విమానంలోనే ఉన్నట్లు తెలిసింది. అయితే, ఎవరికీ ప్రాణాపాయం లేనట్లు తెలిసింది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.