యాప్నగరం

‘బాబు ఇంట్లో సోదాచేస్తే శ్రీవారి నగలు దొరుకుతాయి’

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఎంపీ విజయ్‌సాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో నిర్వహించిన వైసీపీ ర్యాలీలో బాబుపై విరుచుకుపడ్డారు.

Samayam Telugu 23 May 2018, 12:49 pm
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ నేత, ఎంపీ విజయ్‌సాయి రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిధుల కోసం శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపించిన చంద్రబాబు, అక్కడ నేలమాళిగలో లభించిన విలువైన ఆభరణాలను హైదరాబాద్, అమరావతిలోని తన నివాసాలకు తరలించుకుపోయారని విజయ్‌సాయి ఆరోపించారు. వీటి గురించి 12 గంటల్లో చంద్రబాబు నివాసాల్లో సీబీఐ లేదా తెలంగాణ పోలీసులతో సోదాలు నిర్వహిస్తే ఆభరణాలు బయటపడతాయని వ్యాఖ్యానించారు. ఒకవేళ బాబు ఇంట్లో ఆ ఆభరణాలు బయటపడకపోతే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. 12 గంటల కంటే ఎక్కువ సమయం ఇస్తే వాటిని విదేశాలకు తరలించేస్తారని పేర్కొన్నారు.
Samayam Telugu వైసీపీ ఎంపీ విజయ్‌సాయి


కేవలం హెరిటేజ్ సంస్థల వ్యాపారంతోనే వందల కోట్ల ఆస్తులను కూడబెట్టడం అసాధ్యమని, తన కుమారుడు లోకేశ్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారన్న చంద్రబాబు సీబీఐ విచారణను ఎందుకు కోరడం లేదని విజయ్‌సాయి ప్రశ్నించారు. వేల మంది పోలీసులను పెట్టుకున్నా వైసీపీకి ఉన్న ప్రజాభిమానాన్ని చంద్రబాబు అడ్డుకోలేరని ఉద్ఘాటించారు.

టీడీపీ ఎవరిపై ధర్మా పోరాటం చేస్తుందని, చంద్రబాబు పోరాటం ప్రజల పైనా? అని ఆయన నిలదీశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ...తెలుగు డ్రామాల పార్టీ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ధర్మ పోరాటం చేపట్టారని విమర్శించారు. గతంలో ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌‌లో సభ నిర్వహణకు అనుమతి కోరితే నిరాకరించారని, ఇప్పుడు టిడిపికి ఎలా ఇచ్చారని విజయసాయి ప్రశ్నించారు. మంగళవారం టీడీపీ ధర్మపోరాట దీక్ష నిర్వహించిన ప్రాంగణం మలిమైందంటూ గంగాజలంతో శుద్ధి చేయడానికి వైసీపీ ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకుని వైసీపీ నేతలను అదుపులో తీసుకున్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.