యాప్నగరం

టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?

చంద్రబాబును మరో వైసీపీ ఎమ్మెల్యే కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనలా కలిశారో లేదో పార్టీ మారతారంటూ పుకార్లు మొదలయ్యాయి. ఎంపీ రాయపాటి కారులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యక్షమయ్యారు. ఈ ఎపిసోడ్‌పై ముస్తఫా కూడా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలిశానన్నారు. రూ.2 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు.

TNN 3 Feb 2018, 5:41 pm
చంద్రబాబును మరో వైసీపీ ఎమ్మెల్యే కలవడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయనలా కలిశారో లేదో పార్టీ మారతారంటూ పుకార్లు మొదలయ్యాయి. గుంటూరులో ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి సీఎం వెళ్లారు. ఎంపీ రాయపాటి కారులో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యక్షమయ్యారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి నేరుగా సీఎం హెలిప్యాడ్ దగ్గరకు వెళ్లి కలిశారు. ముగ్గురు కలిసి పక్కనే ఉన్న బస్సులోకి వెళ్లి... 10 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అయితే ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే రాయపాటి కారులో రావడంతో ముస్తఫా పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Samayam Telugu ycp mla mustafa meet chandrababu naidu
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే?


ఈ ఎపిసోడ్‌పై ముస్తఫా కూడా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే చంద్రబాబును కలిశానన్నారు. రూ.2 కోట్ల నిధులు ఇచ్చేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చిన సీఎంను మర్యాదపూర్వకంగా కలిశానే తప్ప... వైసీపీలోనే కొనసాగుతానంటున్నారు. టీడీపీలోకి రావాలని ముస్తఫాను... రాయపాటి గతంలోనే ఆహ్వానించారు. ఆయన మాత్రం పార్టీ మారనని చెప్పారు. అయితే సడన్‌గా ఎంపీ కారులోనే ముస్తఫా ప్రత్యక్షం కావడంతో... ఆయన సైకిలెక్కడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.