యాప్నగరం

మళ్లీ వివాదంలో చిక్కుకున్న రోజా

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

TNN 17 Jul 2017, 3:44 pm
టీడీపీ ప్రభుత్వం ఒంటికాలిపై లేచే వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ వివాదంలో ఇరుక్కున్నారు. అసెంబ్లీ స్పీకర్‌పై మరోసారి నోరు పారేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన రోజా అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను ఉద్దేశించి రాజకీయ విమర్శలు చేశారు. రోజా వ్యాఖ్యలను అసెంబ్లీ వర్గాలు స్పీకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ రోజాకు నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.
Samayam Telugu ycp mla rk roja comments against assembly speaker
మళ్లీ వివాదంలో చిక్కుకున్న రోజా


ఎమ్మెల్యేలతో కలసి ముఖ్యమంత్రి మాక్ పోలింగ్ కు పాల్పడ్డారని, స్పీకర్ కూడా దానికి సహకరించారని, ఆయన దిగజారి ప్రవర్తించారంటూ రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పీకర్ సీరియస్‌గా స్పందించారు. తాను స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చేలా ఎన్నడూ ప్రవర్తించలేదని కోడెల పేర్కొన్నారు. తన ప్రవర్తన స్పీకర్ పదవికి వన్నె తెచ్చేలా ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు తాను హాజరవుతుంటానని, వైసీపీ నేతలు కూడా తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటారని అన్నారు. తనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సమానమేనని, ఒకర్ని ఎక్కువగా, మరొకర్ని తక్కువగా చూడనని అన్నారు. ఓటింగ్ సందర్భంగా తాను టీడీఎల్సీ కార్యాలయానికే వెళ్లలేదని కోడెల తెలిపారు. ముఖ్యమంత్రికి, తనకు ఓటు ఎలా వేయాలో నా కార్యాలయం ఎదుటే అధికారులు సూచనలు చేశారని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.