వైసీపీ ఎమ్మెల్యే రోజా మీడియా ముందు భోరున విలపించారు. విమానాశ్రయంలో ఆపి బాంబులు, తుపాకులు, కత్తులు ఉన్న వారిలా అదుపులోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వ చిన్నచూపును వివరిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం తనను చంపేయదని గ్యారెంటీ ఏంటి? అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆది నుంచీ తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్కు తరలించారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాణి ఉందని, తమ ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు తనపై కక్షకట్టారని .. గతంలో టీడీపీ కోసం ఏంతో కష్టపడితే ఇదా నాకిచ్చే బహుమానం అని అన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. చంద్రబాబు అండ చూసుకునే విజయవాడలో నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు చెప్పినదానికల్లా పోలీసులు తలూపుతూ తనపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక శాసన సభ్యురాలికే రక్షణ లేకుండాపోయిందని అన్నారు. నారా బ్రాహ్మణి, వెంకయ్య నాయుడు కూతురు కోసమే జాతీయ మహిళా పార్లమెంట్ పెట్టారా..? అంటూ సీఎం చంద్రబాబుకు , స్పీకర్ కోడెలకు రోజా అంటే భయం ఉన్నప్పుడు మహిళా సాధికారిత సదస్సుకు తనకు ఎందుకు ఆహ్వానం పంపారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యే రోజా.
అమరావతిలో జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన రోజాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య రోజాను హైదరాబాద్కు తరలించారు. అనంతరం వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రోజా.. చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం వల్ల తనకు ప్రాణహాణి ఉందని, తమ ప్రాణాలు పోతే బాధ్యులు ఎవరు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
చంద్రబాబు తనపై కక్షకట్టారని .. గతంలో టీడీపీ కోసం ఏంతో కష్టపడితే ఇదా నాకిచ్చే బహుమానం అని అన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. చంద్రబాబు అండ చూసుకునే విజయవాడలో నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
చంద్రబాబు చెప్పినదానికల్లా పోలీసులు తలూపుతూ తనపై అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక శాసన సభ్యురాలికే రక్షణ లేకుండాపోయిందని అన్నారు. నారా బ్రాహ్మణి, వెంకయ్య నాయుడు కూతురు కోసమే జాతీయ మహిళా పార్లమెంట్ పెట్టారా..? అంటూ సీఎం చంద్రబాబుకు , స్పీకర్ కోడెలకు రోజా అంటే భయం ఉన్నప్పుడు మహిళా సాధికారిత సదస్సుకు తనకు ఎందుకు ఆహ్వానం పంపారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు ఎమ్మెల్యే రోజా.