యాప్నగరం

గెలుపైనా, ఓటమైనా, చావైనా జగన్‌తోనే... రోజా

నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో వైసీపీలో కొంత నైరాశ్యం చోటుచేసుకుంది. నంద్యాల ఉపఎన్నికను 2019 ఎన్నికలకు సెమీ-ఫైనల్‌గా భావించారు.

TNN 29 Aug 2017, 6:02 pm
నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో వైసీపీలో కొంత నైరాశ్యం చోటుచేసుకుంది. నంద్యాల ఉపఎన్నికను 2019 ఎన్నికలకు సెమీ-ఫైనల్‌గా భావించారు. ప్రచారంలో వైఎస్ జగన్‌ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ‘గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా’ అనే క్యాప్షన్ తో మొదలు పెట్టి ‘నాన్న ఆశయాలే శ్వాసగా బతికావు.... కుట్రలను సహించక దేశాన్ని శాసించే నియంత మెడలు వంచి, నమ్ముకున్న మా కోసం దమ్మున్న నాయకుడిగా నాన్న పేరుతో పార్టీ పెట్టావు. దొంగ హామీలు ఇవ్వలేదు, కుల రాజకీయాలు చేయలేదు, వేరొకరి ప్రభతో వెలగాలనుకోలేదు. సింహంలా సింగిల్ గా నిలిచావు. ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాటం చేస్తున్నావు. జగనన్నా, నీ వెంటే మేముంటాం,ఈ పోరాటంలో మేము సైనికులమవుతాం!’ అని పేర్కొన్న రోజా, ‘ఆఖరి శ్వాస వరకూ ‘జై జగన్’ అంటూనే ఉంటా!’ అని ముగించారు.
Samayam Telugu ycp mla roja intresting post on her facebook page for ys jagan
గెలుపైనా, ఓటమైనా, చావైనా జగన్‌తోనే... రోజా



రోజా పోస్ట్‌పై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అనుకూలంగా, ఇంకొందరు వ్యతిరేకంగా చేశారు. మాకు గెలుపు ఓటమి తో సంబంధం లేదు... మా ఊపిరి ఉన్నంత వరకు నాయకుడు జగన్‌తోనే ఉంటాం... జనం కోసం జగన్... జగన్ కోసం జనం... జై జగన్, జై రోజామ్మ అంటే ఓ అభిమాని కామెంట్ చేశాడు. మరో అభిమాని ఒక అడుగు ముందుకేసి 2019 ఎన్నికల్లో జగన్ గెలిచి సీఎం అయితే, నిన్ని డిప్యూటీ సీఎంగా చేస్తారని ఒకరంటే, హోమ్ మినిస్టర్‌ను చేస్తారని ఇంకోకరు కామెంట్ చేశారు. అలాగే ఇలాంటి మాటలు చెప్పకపోతే బయటకు గెంటేస్తారని ఒకరంటే, సినిమా వాళ్లను రాజకీయాలకు వాడుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలేస్తారు జాగ్రత్త అని హెచ్చరించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.