అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. పలమనేరులో వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో రోజా ప్రసంగిస్తూ సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని ఎప్పుడూ నెంబర్ వన్గా చేస్తానని ప్రకటించే చంద్రబాబు చేసిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. అంతే కాదు ఎయిడ్స్లోనూ, మహిళ అక్రమ రవాణాలోనూ ఏపీ మొదటిస్థానంలో ఉందని, ఇవి నేను అంటున్న మాటలు కాదని ఆయన మిత్రుడు ఆంధ్రజ్యోతి, ఈనాడు చెప్పినవేనని ఎద్దేవా చేశారు.
ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎన్సీఆర్ రిపోర్ట్ వెల్లడించిందని అన్నారు. బాల్య వివాహాల్లోనూ మొదటి స్థానంలో ఉందని, పనికొచ్చిన విషయాల్లో కాకుండా పనికిరాని విషయాల్లో ఏపీని ముందు వరుసులో నిలబెట్టారంటే అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని దుయ్యబట్టారు. నాకు ఉంగరం లేదు, వాచీ లేదు అంటూ దొంగ ఆస్తులు, ప్రకటనలు చేసే వీళ్లు దేశంలోనే ధనవంతుల్లో మొదటి సీఎంలో చంద్రబాబు అని డిక్లేర్ చేశారంటే వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని సూచించారు.
ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఎన్సీఆర్ రిపోర్ట్ వెల్లడించిందని అన్నారు. బాల్య వివాహాల్లోనూ మొదటి స్థానంలో ఉందని, పనికొచ్చిన విషయాల్లో కాకుండా పనికిరాని విషయాల్లో ఏపీని ముందు వరుసులో నిలబెట్టారంటే అంటే ఆయన పరిపాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని దుయ్యబట్టారు. నాకు ఉంగరం లేదు, వాచీ లేదు అంటూ దొంగ ఆస్తులు, ప్రకటనలు చేసే వీళ్లు దేశంలోనే ధనవంతుల్లో మొదటి సీఎంలో చంద్రబాబు అని డిక్లేర్ చేశారంటే వారి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని సూచించారు.