యాప్నగరం

ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్

వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయించింది.

Samayam Telugu 4 Mar 2017, 8:08 pm
వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయించింది. టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదు మేరకు శాసనసభ క్రమశిక్షణ సంఘం విచారణ చేపట్టింది.
Samayam Telugu ycp mla roja suspended one more yearycp mla roja suspended one more year
ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్


గతేడాదిలో అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజా..టీడీపీ ఎమ్మెల్యేల అనితపై అనుచితంగా ప్రవర్తించారు. ఆమె మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. దాంతో ఆ యేడాడి మొత్తం రోజాను సభను నుంచి సస్పెండ్ చేశారు.

ఆ అంశంపై శనివారం శాసనసభ క్రమశిక్షణ సంఘం విజయవాడలో సమావేశమైంది. రోజా అనితకు బేషరతుగా చెప్పలేదని...తన అనుచిత వైఖరిపై ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ సంఘం సంతృప్తి చెందలేదు. దీంతో ఆమపై మరో ఏడాది సస్పెన్షన్ కొనసాగించాలని నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.