యాప్నగరం

YSRCP: కేరళకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నెల జీతం వితరణ

వరదలో అతలాకుతలమైన కేరళను ఆదుకోడానికి దాతలు తమ వంతు సాయం అందజేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు, చిన్నారులు కూడా కేరళకు చేయూతనివ్వడానికి ముందుకొస్తున్నారు.

Samayam Telugu 28 Aug 2018, 9:50 am
వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోడానికి దాతలు తమ వంతు సాయం అందజేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు, చిన్నారులు కూడా కేరళకు చేయూతనివ్వడానికి ముందుకొస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు విరాళాలు అందజేస్తున్నారు. అనేక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ వేతనాలను కేరళకు అందజేశారు. ఇప్పటికే వైసీపీ తరఫున ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేరళకు రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ప్రజాప్రతినిధులు ఒక్క నెల వేతనం కేరళకు అందజేయాలని నిర్ణయించారు.
Samayam Telugu వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం


వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఆగస్టు నెల జీతభత్యాలను (అలవెన్సులతో కలిపి) కేరళ వరద బాధితుల సహాయం కోసం అందజేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ కోరారు. ఈ మొత్తాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు డీడీ తీసి శాసనసభాపక్ష కార్యాలయ ఇంఛార్జిలకు అందజేయాలని అసెంబ్లీ కార్యదర్శికి జగన్ సోమవారం లేఖ రాశారు. అలాగే అసెంబ్లీలోని తన వ్యక్తిగత ఖాతా నుంచి జగన్ రూ.20 లక్షల కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేసినట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.