యాప్నగరం

‘లోకేశ్‌లో అభిజ్ఞా పక్షపాతం.. సమస్య కూడా ఇదే’

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటికాలిపై లేచే వైసీపీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో విరుచుకుపడుతుంటారు. రోజూ ట్విట్టర్‌లో ట్వీట్లతో హోరెత్తించే విజయసాయి మరోసారి విమర్శలు కురిపించారు.

Samayam Telugu 22 Jul 2019, 1:57 pm
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, నారా లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు. తమ సామర్ధ్యాన్ని ఎక్కువగా ఊహించుకోవడమనే వ్యాధితో నారా లోకేశ్ బాధపడుతున్నాడని సెటైర్ వేశారు. ఆ వ్యాదే అతడికి సమస్య అయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని డన్నింగ్-క్రూగర్ ఎఫెక్ట్ అంటారని, లోకేశ్‌లో అభిజ్ఞా పక్షపాతం కూడా ఉందని ఎద్దేవా చేశారు. రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు నిలిపివేయడానికి కారణం కుంభకోణాలేనని దుయ్యబట్టారు. అమరావతి కుంభకోణాల పుట్టని గ్రహించిన వరల్డ్ బ్యాంక్ రుణాన్ని నిలిపివేసిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. రియల్ ఎస్టేట్‌కు మేలు చేసేలా ఉండటం, రుణం మంజూరు చేయకుండానే 92 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1872 కోట్లతో టెండర్ ఆమోదించడం పెద్ద కుంభకోణంగా ప్రపంచ బ్యాంకు దర్యాప్తులో వెల్లడయినట్టు విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు.
Samayam Telugu nara-lokesh-647_040217101057


‘తామే సర్వజ్ఞానులమని, అన్యులంతా అజ్ఞానులని భావించేవారు Cognitive Bias (అభిజ్ఞా పక్షపాతం)తో ఉంటారని సైకాలజీ చెబుతోంది. దీనిని Dunning-Kruger effect అని పిలుస్తారు. లోకేశ్ సమస్య కూడా ఇదే. తండ్రి చాలా కాలం అధికారంలో ఉండటం. ఒక్కడే సంతానం కావడం వల్ల ఈ వ్యాధికి లోనై ఉండవచ్చు’ అని అంటూ ట్వీట్ చేశారు.

‘అమరావతి ఒక స్కామ్‌ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు 3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసింది. రియల్‌ ఎస్టేట్‌కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు ఆమోదించడం అతి పెద్ద కుంభకోణంగా బ్యాంకు దర్యాప్తులో వెల్లడైంది’ దుయ్యబట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.