యాప్నగరం

పోలవరం: యువతిని చంపి ప్రేమోన్మాది ఆత్మహత్య

ప్రేమోన్మాదానికి మరో యువతి బలయ్యింది. తనను ప్రేమించిలేదనే కోపంతో యువతిని దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత అతడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు.

Samayam Telugu 20 Jun 2018, 12:14 pm
ప్రేమోన్మాదానికి మరో యువతి బలయ్యింది. తనను ప్రేమించిలేదనే కోపంతో యువతిని దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత అతడు పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో జరిగిన ఘటన స్థానికంగా కలకలంరేపింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెంకు చెందిన లహరి స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. టీ.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంకు చెందిన కిరణ్ ఆటో డ్రైవర్. కొద్దిరోజుల క్రితం ఇద్దరికి పరిచయం ఏర్పడింది.
Samayam Telugu Murder


పరిచయాన్ని ప్రేమగా భావించిన కిరణ్ లహరి వెంటపడ్డాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. ఆమె తిరస్కరించినా వేధిస్తూనే ఉన్నాడు. ఈలోపు లహరికి సతీష్ అనే మరో యువకుడితో వివాహం నిశ్చమయ్యింది. ఇది తెలుసుకున్న కిరణ్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి లహరి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని మళ్లీ అడిగాడు. ఆమె ససేమీరా అనడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను విచరక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అతడ్ని అడ్డుకున్న లహరి తమ్ముడికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

హత్య తర్వాత భయపడిపోయిన కిరణ్.. లహరి ఇంటి నుంచి పారిపోయాడు. జంగారెడ్డి గూడెం సమీపంలోని అడవిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కోసం గాలించిన పోలీసులు.. ఇవాళ అడవిలో మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టమ్ తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.