యాప్నగరం

కరీంనగర్: ప్రేమోన్మాది ఘాతుకం.. కలెక్టరేట్ ముందే యువతి దారుణ హత్య

కరీంనగర్‌లో కలెక్టరేట్ దగ్గర దారుణం జరిగింది. దారుణంగా యువతి గొంతు కోశాడో యువకుడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు విడిచింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వెంటనే పట్టుకొని చితకబాదారు.

Samayam Telugu 15 Jun 2018, 12:49 pm
కరీంనగర్‌లో కలెక్టరేట్ దగ్గర దారుణం జరిగింది. దారుణంగా యువతి గొంతు కోశాడో యువకుడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు విడిచింది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. స్థానికులు వెంటనే పట్టుకొని చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తుండగా.. నిందితుడిని కూడా ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu Murder..


మృతురాలిని రామగుండం హనుమాన్ నగర్‌కు చెందిన రసజ్ఞగా గుర్తించారు. మూడ నెలల క్రితం ఆమె కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఈ-సేవా కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంకు చెందిన వంశీధర్‌ అని పోలీసులు చెప్పారు. ఉదయం ఆమె విధులకు వచ్చిన కొద్దిసేపటికి.. ఆ యువకుడు కూడా అక్కడికి వచ్చాడట. మాట్లాడాలి రమ్మని ఆమెను బయటకు పిలిచాడట. వెంటనే ఆమె గొంతు కోసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.