యాప్నగరం

దారుణం: పిలిస్తే పలకలేదని స్నేహితుడినే చంపేశారు..

పిలిస్తే పలకలేదన్న కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

Samayam Telugu 18 Jul 2018, 7:18 pm
పిలిస్తే పలకలేదన్న కోపంతో స్నేహితుడిపై కత్తితో దాడి చేసి చంపేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న సమయంలో పిలిస్తే పలకలేదనే కోపంతో స్నేహితులే దారుణానికి ఒడిగట్టారు. తిరుగు ప్రయాణంలో బైక్‌ ఆపి, ఘర్షణకు దిగారు... మాటామాటా పెరిగి కత్తితో దాడి చేయడంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ ఆ యువకుడు మృతిచెందాడు.
Samayam Telugu murder


వివరాల్లోకి వెళ్తే.. జిర్రా కిషన్‌నగర్‌కు చెందిన జాఫర్ కుమారుడు మహమ్మద్ ఇసా (22) పండ్ల వ్యాపారి... శనివారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇసాను అతడి స్నేహితుడు మాజిద్ పని ఉందని బైక్‌పై బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బైక్‌పై వెళ్తున్న ఇసాను చూసిన అతడి స్నేహితులు మహమూద్, ముస్తాపాలు పిలిచారు. అది వినబడకపోవడంతో ఇసా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

అయితే రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇసా తిరిగి వచ్చేవరకు అక్కడే కాపు కాసిన స్నేహితులు మరోమారు పిలిచారు. దీంతో స్నేహితుల దగ్గరకు వెళ్లిన ఇసాను పిలిచినా పట్టించుకోకుండా ఎందుకు వెళ్లిపోయావంటూ ప్రశ్నించారు. ఇసాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇసా, మహమూద్‌ మధ్య మాటామాటా పెరిగింది. దీంతో మహమూద్‌ ఒక్కసారిగా కత్తితో ఇసాపై దాడిచేశాడు. కత్తి చాతికీ గుచ్చుకోవడంతో ఇసా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

పోలీసులకు సమాచారం అందడంతో.. సంఘటన స్థలానికి చేరుకుని ఇసాను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలపాలైన ఇసా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో హత్యానేరం కింద నిందితులపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.