యాప్నగరం

Old City: స్నేహితుల మధ్య గొడవ.. యువకుడు దారుణ హత్య

ఓ చిన్న విషయంలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. దీంతో ఆవేశంతో ఓ యువకుడిపై తన స్నేహితుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

Samayam Telugu 25 Dec 2018, 10:16 am
Samayam Telugu murder
స్నేహితుల చేతిలోనే ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఓ చిన్న విషయంలో మాటా మాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకునే దాకా వెళ్లింది. దీంతో ఆవేశంతో ఓ యువకుడిపై తన స్నేహితుడు కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాలాపత్తర్ పొలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఖాజా పహాడీ రంజన్ కాలనీ ప్రాంతంలోని గుర్రపు దొడ్డి వద్ద మొసీన్, మహ్మద్‌ అమీర్‌ మరి కొంత మంది స్నేహితులతో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో వీరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో మొసీన్‌‌పై మహ్మద్ అమీర్ కత్తితో దాడి చేశాడు. మొసీస్ ఎడమ తోడపై బలంగా పోడవంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రామై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడ ఉన్నవవారు వెంటనే అతడిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొసీన్ మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి కాలపత్తర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల కాలంలో పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వీటిని అదుపు చేయలేకపోతున్నారు. గత సెప్టెంబరులోనూ ఓ యువకుడి స్నేహితుడి చేతిలోనే హత్యకు గురయ్యాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.