యాప్నగరం

YS Bharathi: ఛార్జిషీట్‌లో భారతి పేరు.. జగన్ షాకింగ్ రెస్పాన్స్

తన భార్య వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు పత్రికల్లో కథనాలు రావడం పట్ల వైఎస్‌ఆర్సీపీ నేత వైఎస్ జగన్ స్పందించారు.

Samayam Telugu 10 Aug 2018, 11:04 am
తన భార్య వైఎస్ భారతి పేరును ఈడీ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు పత్రికల్లో కథనాలు రావడం పట్ల వైఎస్‌ఆర్సీపీ నేత వైఎస్ జగన్ స్పందించారు. ఓ వర్గం మీడియాలో ఈ రోజు వచ్చిన వార్త తనను షాక్‌కు గురి చేసిందని జగన్ పేర్కొన్నారు. ‘భారతి పేరును ఈడీ ఛార్జీషీటులో చేర్చిందనే వార్తలు వచ్చాయి. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింద’ని శుక్రవారం ఉదయం జగన్ ట్వీట్ చేశారు. ‘కుటుంబ సభ్యులను కూడా వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు, ఇది చాలా బాధాకర’మని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Samayam Telugu ys jagan4


జగన్ అక్రమాస్తుల కేసులో ఆయన భార్య వైఎస్ భారతి పేరును కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఛార్జిషీట్‌లో చేర్చినట్టు కథనాలు వెలువడ్డాయి. భారతి సిమెంట్స్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చినట్టు సమాచారం. ఇదే కేసులో సీబీఐ ఛార్జిషీట్‌లో మాత్రం భారతి పేరు లేకపోవడం గమనార్హం. తొలిసారి ఈడీ ఛార్జిషీట్‌లో ఆమె పేరున్నట్టు వచ్చిన వార్తలు సంచలనం సృష్టించాయి.

వైఎస్ భారతితోపాటు విజయసాయి రెడ్డి, సిలికాన్ బిల్డర్స్, సండూరు పవర్, క్లాసిక్ రియాల్టీ, సరస్వతి పవర్, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వి.డి.రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం పేర్లను ఈడీ ఛార్జిషీట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.