యాప్నగరం

నంద్యాల్లో వైసీపీ తరఫున వారి ప్రచారం?

నంద్యాల ఉప ఎన్నికల పోరు క్రమంగా రసవత్తరం అవుతోంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు

TNN 27 Jul 2017, 10:00 am
నంద్యాల ఉప ఎన్నికల పోరు క్రమంగా రసవత్తరం అవుతోంది. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు అమీతుమీ తలపడుతున్నాయి. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నంద్యాల్లో రెండు సార్లు పర్యటించారు. భూమా నాగిరెడ్డి మరణం నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో గెలవాలని బాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక బాబు పాలనపై రెఫరండమే అని తెలుగుదేశం నేత, మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు కూడా. ఇక తెలుగుదేశం తరపున దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఆరు మంది మంత్రులు, ఇంకా కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలు నంద్యాల్లో ప్రచారం చేస్తున్నారు.
Samayam Telugu ys family to campaign in nandyal
నంద్యాల్లో వైసీపీ తరఫున వారి ప్రచారం?


ఈ విధంగా భారీ స్థాయిలో ప్రచారం చేపట్టిన అధికార పార్టీని ఎదుర్కొనడానికి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా సమాయత్తం అవుతోంది. నోటిఫికేషన్ విడుదల కాగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పది రోజుల పాటు నంద్యాల్లోనే ఉంటారని, ఇంటింటి ప్రచారం చేస్తారని... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.

అంతేకాదు..ఆ పార్టీ తరపున ప్రచారానికి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలలు కూడా వస్తారని వైకాపా నేతలు చెబుతున్నారు. వారు కూడా నంద్యాల్లో పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున ప్రచారం చేస్తారని వైకాపా నేతలు వివరించారు. ఇది వరకూ కూడా షర్మిల, విజయమ్మలు వైకాపా తరపున ప్రచారం చేసిన దాఖలాలున్నాయి. కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంతో పాటు.. సార్వత్రిక ఎన్నికల్లో కూడా వీరు వైకాపా తరపున ప్రచారం చేశారు. అయితే గత మూడు సంవత్సరాలుగా క్రియాశీల రాజకీయాలకు వీరు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల వైకాపా ప్లీనరీలో విజయమ్మ, షర్మిల పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.