ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కౌరవుల సభను తలపిస్తోందని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ‘అగ్రిగోల్డ్’ భూముల వ్యవహారం వెనుక పెద్ద కుంభకోణం జరిగిందని ఆయన శుక్రవారం విజయవాడలో ఆరోపించారు.
అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారని నిరూపిస్తూ ఆధారాలు సమర్పించేందుకు 20 నిమిషాలు సమయం ఇవ్వాలని అడిగినా స్పీకర్ అనుమతి ఇవ్వలేదని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు హైకోర్టు జడ్జి చేతగానీ, సీబీఐచేతగానీ న్యాయ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంత్రిప్రత్తిపాటి పుల్లారావుకు తనకు మధ్య వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పిన జగన్....అగ్రిగోల్డ్ వెనుక పెద్ద హస్తం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో 20లక్షలమందికి టోపీ పెట్టి రూ.కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్తులమ్మి వచ్చిన డబ్బులను డిపాజిట్ దార్లకు చెల్లించాలని ఆయన సూచించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబీకులు కొనుగోలు చేసినట్లు తన దగ్గర ఆధారాలున్నాయని...జగన్ అగ్రిగోల్డ్ భూ రికార్డు పత్రాలను మీడియాకు చూపించారు.
ప్రజా సమస్యలను లేవనెత్తితే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగన్ అన్నారు.
అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొనుగోలు చేశారని నిరూపిస్తూ ఆధారాలు సమర్పించేందుకు 20 నిమిషాలు సమయం ఇవ్వాలని అడిగినా స్పీకర్ అనుమతి ఇవ్వలేదని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు హైకోర్టు జడ్జి చేతగానీ, సీబీఐచేతగానీ న్యాయ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంత్రిప్రత్తిపాటి పుల్లారావుకు తనకు మధ్య వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పిన జగన్....అగ్రిగోల్డ్ వెనుక పెద్ద హస్తం ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో 20లక్షలమందికి టోపీ పెట్టి రూ.కోట్లు కాజేశారని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్తులమ్మి వచ్చిన డబ్బులను డిపాజిట్ దార్లకు చెల్లించాలని ఆయన సూచించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చ జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూములను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబీకులు కొనుగోలు చేసినట్లు తన దగ్గర ఆధారాలున్నాయని...జగన్ అగ్రిగోల్డ్ భూ రికార్డు పత్రాలను మీడియాకు చూపించారు.
ప్రజా సమస్యలను లేవనెత్తితే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని జగన్ అన్నారు.