యాప్నగరం

జగన్ పాదయాత్ర కోసం యూఎస్ నుంచి!

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్రలో

TNN 10 Jan 2018, 6:01 pm
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న వైఎస్ జగన్ పాదయాత్రలో ఆసక్తికరమైన జంట పాలుపంచుకుంది. జగన్ తో పాటు వాళ్లు కూడా కొంతదూరం నడిచారు. ఇక్కడ ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఆ భార్యభర్తలు పాదయాత్రలో పాల్గొనడానికి అమెరికా నుంచి సొంతూరికి వచ్చారట. జగన్ పాదయాత్ర తమ సొంతూరు మీదుగా సాగుతున్న సమయంలో వారు అమెరికా నుంచి ఇక్కడకు వచ్చినట్టుగా తెలిపారు.
Samayam Telugu ys jagan crosses 800km milestone
జగన్ పాదయాత్ర కోసం యూఎస్ నుంచి!


ప్రజాసంకల్ప పాదయాత్రలో పాలు పంచుకోవడం తమకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తోందని ఆ భార్యభర్తలు తెలిపారు. పాదయాత్ర చేయడం వల్ల జగన్ కు ప్రజాసమస్యల గురించి మరింత అవగాహన వస్తుందని.. జగన్ కు మంచి ప్రజాదరణ ఉందని వారు అభిప్రాయపడ్డారు. సినిమా నటులకు మించిన స్థాయిలో జగన్ కోసం జనం వస్తున్నారన్నారు. తమను జగన్ ఆప్యాయంగా మాట్లాడించారని హరిప్రసాద్, సరిత అనే ఆ దంపతులు వివరించారు.

ఇక జగన్ పాదయాత్ర 800 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసుకుంది. కడప జిల్లా ఇడుపుల పాయ నుంచి మొదలైన జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో కలిమిచర్ల వద్ద జగన్ ఎనిమిది వందల కిలోమీటర్ల మార్కును దాటారు. ఈ సందర్భంగా అక్కడ చెట్టును నాటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.