జగన్ డిశ్చార్జి పిటిషన్.. ఏం జరగబోతోంది?
తనపై నమోదైనవి అసంబద్ధమైన కేసులు అని, వాటి చార్జిషీట్స్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్
TNN 23 Sep 2017, 11:26 am
తనపై నమోదైనవి అసంబద్ధమైన కేసులు అని, వాటి చార్జిషీట్స్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ ఆసక్తికరంగా మారింది. ఈ పిటిషన్లో జగన్ తో పాటు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యి ఉన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఏ1గా జగన్ ఉన్నారు, ఏ2గా విజసాయి రెడ్డి ఉన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులు అక్రమ పద్ధతిలో వచ్చాయనేది ఆరోపణ. ఇందుకు సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. ఆ పరిణామాలు అందరూ ఎరిగినవే.
ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నుంచి తన పేరును తొలగించాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలు సార్లు విచారణ జరిగింది. జగన్ మోసం చేసి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాడు అని సీబీఐ వాదించింది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం అలాంటిది ఏమీ లేదని అంటున్నారు. పెట్టుబడి పెట్టిన వారెవరూ జగన్ పై ఆ ఫిర్యాదులు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు.
జగన్ కంపెనీల విలువ కడుతూ డెలాయిట్ వేసిన అంచనా, మోసపూరితం అని సీబీఐ వాదించింది. అయితే జగన్ కంపెనీల విలువను సీబీఐ కూడా లెక్కగట్టించిందని, సీబీఐ వేసిన అంచనాలకు, డెలాయిట్ సంస్థ ఇచ్చిన అంచనాల లెక్కకు మధ్య వ్యత్యాసం లేదని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిగింది.
పెట్టుబడుల విషయంలో జగన్ ఎవరినీ మోసం చేయలేదని న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. సీబీఐ సాక్షులుగా పేర్కొంటూ నమోదు చేసిన వాంగ్మూల్లాలో కూడా ఎవరూ జగన్ పేరును ప్రస్తావించలేదని వివరించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ఆరో తేదీకి వాయిదా వేసింది.
మరి ఆ రోజున వాదనలు ఎలా ఉంటాయి, ఈ డిశ్చార్జి పిటిషన్లను కోర్టు ఆమోదించి.. కేసుల నుంచి కోర్టు జగన్ ను తప్పిస్తూ తీర్పునిస్తుందా? అనేది ఆసక్తికరమైన అంశంగా మారిందిప్పుడు.
ఈ నేపథ్యంలో ఇటీవల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ నుంచి తన పేరును తొలగించాలని ఆయన సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ పిటిషన్ పై పలు సార్లు విచారణ జరిగింది. జగన్ మోసం చేసి తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాడు అని సీబీఐ వాదించింది. అయితే జగన్ తరఫు న్యాయవాదులు మాత్రం అలాంటిది ఏమీ లేదని అంటున్నారు. పెట్టుబడి పెట్టిన వారెవరూ జగన్ పై ఆ ఫిర్యాదులు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు.
జగన్ కంపెనీల విలువ కడుతూ డెలాయిట్ వేసిన అంచనా, మోసపూరితం అని సీబీఐ వాదించింది. అయితే జగన్ కంపెనీల విలువను సీబీఐ కూడా లెక్కగట్టించిందని, సీబీఐ వేసిన అంచనాలకు, డెలాయిట్ సంస్థ ఇచ్చిన అంచనాల లెక్కకు మధ్య వ్యత్యాసం లేదని జగన్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి ఈ పిటిషన్ పై విచారణ జరిగింది.
పెట్టుబడుల విషయంలో జగన్ ఎవరినీ మోసం చేయలేదని న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదించారు. సీబీఐ సాక్షులుగా పేర్కొంటూ నమోదు చేసిన వాంగ్మూల్లాలో కూడా ఎవరూ జగన్ పేరును ప్రస్తావించలేదని వివరించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ ఆరో తేదీకి వాయిదా వేసింది.
మరి ఆ రోజున వాదనలు ఎలా ఉంటాయి, ఈ డిశ్చార్జి పిటిషన్లను కోర్టు ఆమోదించి.. కేసుల నుంచి కోర్టు జగన్ ను తప్పిస్తూ తీర్పునిస్తుందా? అనేది ఆసక్తికరమైన అంశంగా మారిందిప్పుడు.