యాప్నగరం

వ్యవసాయం అంటే ఏంటో జగన్‌కు తెలియదు

వ్యవసాయం అంటే ఏంటో ప్రతిపక్ష నేత, వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ కు తెలియదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి

Samayam Telugu 1 May 2017, 4:40 pm
వ్యవసాయం అంటే ఏంటో ప్రతిపక్ష నేత, వైఎస్ ఆర్ సీపీ అధినేత జగన్ కు తెలియదని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. కేవలం జగన్ ఉనికి కోసమే గుంటూరులో రైతు దీక్ష చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Samayam Telugu ys jagan does not know agriculture says minister prathipati pullarao
వ్యవసాయం అంటే ఏంటో జగన్‌కు తెలియదు

రైతులకు ఏ రాష్ట్రంలో లేనివిధంగా రుణమాఫీ ఏపీలో చేశామని పుల్లారావు వివరించారు. రూ.24వేల కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు ఆయన వివరించారు.

అన్నిపంటలకు మద్ధతు ధర కల్పిస్తున్నామని చెప్పిన పుల్లారావు... రైతు సమస్యలపై చర్చించేందుకు జగన్ చర్చలకు రావాలని సవాల్ విసిరారు. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు కోసం కేంద్రప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నామని పుల్లారావు చెప్పారు.

మిర్చి రైతులకు అదనపు ధరను అందించేందుకు చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే 2016-17కు గానూ ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.