పవన్ కళ్యాణ్పై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వేడి చల్లారకముందే మరోసారి ఆయన తన మాటల తూటాలకు గురిపెట్టారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్పపై విరుచుకుపడ్డారు జగన్. బుధవారం నాడు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో 220వ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన హోంమంత్రి సొంత నియోజకవర్గంలోనే అక్షరాలా ఆరు హత్యలు జరగటం టీడీపీ ప్రభుత్వ రాక్షస పాలనకు అద్దం పడుతోందన్నారు.
ఇక్కడ ఆసుపత్రుల పరిస్థితి ఇదీ:
ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం ప్రాంతంలో హాస్పటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెద్దాపురం హాస్పటల్ పేరుకే 100 పడకల ఆసుపత్రి. అందులో బెడ్లు 58 మాత్రమే ఉంటాయి. 12 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. నలుగురు మాత్రమే ఉంటారు. మిగిలిన ఎనిమిది మంది డాక్టర్ల అడ్రస్ ఉండదు. పిల్లల డాక్టర్, ఎముకల డాక్టర్, గైనకాలజిస్ట్లు ఇక్కడ ఉండరు. 3 అంబులెన్స్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కటి మాత్రమే నడుస్తోంది. 24 మంది నర్సులు పనిచేయాల్సి ఉండగా.. 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం జనరేటర్ కూడా సరిగా పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సరైన వైద్యం ఎలా అందుతుందన్నారు జగన్.
హోం మంత్రి రాజప్ప.. ఆయన సొంత సామాజిక వర్గానికి అండగా ఉండాల్సింది పోయి.. చంద్రబాబుకు వంగి వంగి సలామ్లు చేస్తూ ఆయుధంగా మారారు . పక్కనే ఉన్న పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు చంద్రబాబు. ఇందులో హోం శాఖా మంత్రి కొడుకు హస్తం కూడా ఉంది. చెరువుల్ని తవ్వేసి మట్టి అమ్మేసుకుంటున్నారు. వేట్లపాలెంలో రిబ్బర్ కటింగ్ చేసి మరీ మట్టి దోపిడీ చేసిన ఘనత టీడీపీ పాలకులది.
పోలవరం ప్రాజెక్ట్ పనులు 56 శాతం పూర్తైందంటున్నారు చంద్రబాబు. ఆ పనుల్లో 80 శాతం పనులు రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో జరిగాయి. దివంగత నేత చేసిన పనుల్ని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. ఇక్కడ పండే చెరుకుకు గిట్టుబాటు ధర లేదు. వైఎస్ హయాంలో క్వింటాల్కు 5400 రూపాయలు వచ్చిన రోజులున్నాయని ఇప్పుడు 3000 కూడా రాని పరిస్థితిలో ఉన్నామని ఇక్కడ రైతులు తనకు చెప్పారన్నారు జగన్.
చంద్రబాబు పాలనలో కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు, బస్ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు. పేద విద్యార్థికి ఆసరాగా ఉండేందుకు వైఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెడితే ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. పేదలకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ పడకేసింది. 108 నెంబర్కు ఫోన్ కొడితే నేనున్నా అంటూ స్వరం వినిపించేది. ఇప్పుడు ఆ నెంబర్కు ఫోన్ కొడితే పనిచేయని పరిస్థితి. ఇళ్లు లేవు, స్థలాలు లేవు, ప్రత్యేక హోదా లేనే లేదు.
‘ప్రత్యేక హోదా చంద్రబాబు డ్రామాలు’.. అనే సినిమా రోజూ పేపర్, టీవీలలో చూపిస్తూనే ఉన్నారు చంద్రబాబు. నాలుగేళ్ల పాలనలో మోసం, అబద్ధం, అవినీతిలతో రాష్ట్రాన్ని ముంచేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే మీ అందరి ప్రోత్సాహం కావాలి. మీ అందరి అభిమానం, ఆప్యాయతలతో రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు జగన్.
ఇక్కడ ఆసుపత్రుల పరిస్థితి ఇదీ:
ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం ప్రాంతంలో హాస్పటల్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెద్దాపురం హాస్పటల్ పేరుకే 100 పడకల ఆసుపత్రి. అందులో బెడ్లు 58 మాత్రమే ఉంటాయి. 12 మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా.. నలుగురు మాత్రమే ఉంటారు. మిగిలిన ఎనిమిది మంది డాక్టర్ల అడ్రస్ ఉండదు. పిల్లల డాక్టర్, ఎముకల డాక్టర్, గైనకాలజిస్ట్లు ఇక్కడ ఉండరు. 3 అంబులెన్స్లు ఉండాల్సి ఉండగా.. ఒక్కటి మాత్రమే నడుస్తోంది. 24 మంది నర్సులు పనిచేయాల్సి ఉండగా.. 9 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కనీసం జనరేటర్ కూడా సరిగా పనిచేయదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సరైన వైద్యం ఎలా అందుతుందన్నారు జగన్.
హోం మంత్రి రాజప్ప.. ఆయన సొంత సామాజిక వర్గానికి అండగా ఉండాల్సింది పోయి.. చంద్రబాబుకు వంగి వంగి సలామ్లు చేస్తూ ఆయుధంగా మారారు . పక్కనే ఉన్న పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలవరం కాంట్రాక్టులు కట్టబెట్టి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారు చంద్రబాబు. ఇందులో హోం శాఖా మంత్రి కొడుకు హస్తం కూడా ఉంది. చెరువుల్ని తవ్వేసి మట్టి అమ్మేసుకుంటున్నారు. వేట్లపాలెంలో రిబ్బర్ కటింగ్ చేసి మరీ మట్టి దోపిడీ చేసిన ఘనత టీడీపీ పాలకులది.
పోలవరం ప్రాజెక్ట్ పనులు 56 శాతం పూర్తైందంటున్నారు చంద్రబాబు. ఆ పనుల్లో 80 శాతం పనులు రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో జరిగాయి. దివంగత నేత చేసిన పనుల్ని కూడా తన ఖాతాలో వేసుకుంటున్నారు చంద్రబాబు. ఇక్కడ పండే చెరుకుకు గిట్టుబాటు ధర లేదు. వైఎస్ హయాంలో క్వింటాల్కు 5400 రూపాయలు వచ్చిన రోజులున్నాయని ఇప్పుడు 3000 కూడా రాని పరిస్థితిలో ఉన్నామని ఇక్కడ రైతులు తనకు చెప్పారన్నారు జగన్.
చంద్రబాబు పాలనలో కరెంట్ చార్జీలు బాదుడే బాదుడు, బస్ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూల్ ఫీజులు బాదుడే బాదుడు. పేద విద్యార్థికి ఆసరాగా ఉండేందుకు వైఎస్ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశ పెడితే ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. పేదలకు అండగా నిలిచే ఆరోగ్య శ్రీ పడకేసింది. 108 నెంబర్కు ఫోన్ కొడితే నేనున్నా అంటూ స్వరం వినిపించేది. ఇప్పుడు ఆ నెంబర్కు ఫోన్ కొడితే పనిచేయని పరిస్థితి. ఇళ్లు లేవు, స్థలాలు లేవు, ప్రత్యేక హోదా లేనే లేదు.
‘ప్రత్యేక హోదా చంద్రబాబు డ్రామాలు’.. అనే సినిమా రోజూ పేపర్, టీవీలలో చూపిస్తూనే ఉన్నారు చంద్రబాబు. నాలుగేళ్ల పాలనలో మోసం, అబద్ధం, అవినీతిలతో రాష్ట్రాన్ని ముంచేశారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే, చెడిపోయిన రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే మీ అందరి ప్రోత్సాహం కావాలి. మీ అందరి అభిమానం, ఆప్యాయతలతో రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని కోరారు జగన్.