యాప్నగరం

గంటా దగ్గరుండి కబ్జా చేయించారు: జగన్

మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు భూములను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు.

TNN 22 Jun 2017, 2:20 pm
మంత్రి గంటా శ్రీనివాసరరావు దగ్గరుండి భూములన్నింటినీ కబ్జా చేయించారని, ఆయన బంధువు భాస్కరరావు భూములను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. పేదల కాలనీలో భూములను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్న భాస్కరరావు.. వాటిని బ్యాంకుల్లో తాకట్టుపెట్టి లోన్లు తీసుకున్నారని జగన్ దుయ్యబట్టారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న భూ కబ్జాలకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం వైజాగ్‌లో చేపట్టిన ‘సేవ్ విశాఖ’ మహా ధర్నాలో జగన్ పాల్గొన్నారు.
Samayam Telugu ys jagan fires on ganta srinivasa rao at ysrcp maha dharna in visakhapatnam
గంటా దగ్గరుండి కబ్జా చేయించారు: జగన్


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంటా బంధువుల భూ కబ్జాలకు స్వయంగా ప్రభుత్వాధికారులే సహకరిస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. విశాఖలో భూ కబ్జాలకు పాల్పడుతోంది సాక్షాత్తు ఒక మంత్రేనని గతంలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను జగన్ గుర్తుచేశారు. జిల్లా కలెక్టరే స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో కుమ్మక్కై భూములు దోచుకుంటుంటే సామాన్యుడు ఎక్కడికెళ్లాలని మండిపడ్డారు. తాను విశాఖకు వస్తున్నానని తెలిసి కంప్యూటర్లలో కొన్ని భూములు లెక్కలు సరిచేశారని ఆరోపించారు.

జిల్లాలో జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపేందుకే మహాధర్నా అని జగన్‌ అన్నారు. ఈ ధర్నాతోనైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్, రెవెన్యూ అధికారులు కలిసి మాఫియాగా మారారని ధ్వజమెత్తారు. భూములను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముదపాకలో ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో భారీగా అసైన్డ్‌ భూములను కొట్టేసే ప్లాన్‌ చేశారని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.