యాప్నగరం

చంద్రబాబును సీఎంగా సంబోధించిన జగన్.. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం

ఏపీ అసెంబ్లీలో పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన జరిగిన ఒప్పందాలపై చర్చ సమయంలో ఆసక్తికర సన్నివేశం. చిన్న పొరపాటు చేసిన జగన్.. వైసీపీ ఎమ్మెల్యేల అప్రమత్తతో సరి చేసుకున్న జగన్

Samayam Telugu 19 Jul 2019, 6:41 pm
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సభలో టీడీపీ హయాంలో పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించిన జరిగిన ఒప్పందాలపై శుక్రవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి జగన్ పొరపాటున నోరు జారారు. చంద్రబాబును ముఖ్యమంత్రిగా సంభోదించారు. తర్వాత వైసీపీ సభ్యులు జగన్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే సరి చేసుకున్నారు.
Samayam Telugu cm jagan


కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు, సీఈఆర్సీ మార్గదర్శకాల ప్రకారం పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేశామన్నారు జగన్. సీఈఆర్సీ మార్గదర్శకాలను ఏపీఈఆర్సీ అనుసరించదని.. ఈ విషయం 40 ఏళ్ల ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి తెలియదా అంటూ ప్రశ్నించారు. స్క్రీన్ మీద డిస్‌ప్లే చేయిస్తున్నాం.. చూస్తే 'ముఖ్యమంత్రి' గారికి ఈ విషయం అర్థం అవుతుందని జగన్ నోరు జారారు. అంటే చంద్రబాబును పొరపాటున ముఖ్యమంత్రిగా వ్యాఖ్యానించారు.

జగన్ పొరపాటున చంద్రబాబును ముఖ్యమంత్రిగా సంభోదించడాన్ని వైసీపీ సభ్యులు గమనించారు. వెంటనే మాజీ ముఖ్యమంత్రి అని సూచించడంతో.. సీఎం జగన్ సరి చేసుకున్నారు. దీంతో సభలో కాసేపు నవ్వుల పువ్వులు పూశాయి. తర్వాత జగన్ ప్రసంగిస్తోన్న వేళ టీడీపీ నేతలు ఆందోళనకు దిగడంతో.. కుక్క తోక వంకర అని జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.