యాప్నగరం

విచారణ జరిగిన తర్వాతే వాంగ్మూలం ఇస్తా: వైఎస్ జగన్ స్పష్టం

తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ నేత నిరాకరించారు. దానిపై నోటీసులు అందుకున్న జగన్ కోర్టుకు తన సమాధానం పంపించారు.

Samayam Telugu 21 Nov 2018, 11:26 pm
తనపై జరిగిన కత్తిదాడి కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కాస్త గడువు కోరారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో దాడికి సంబంధించిన కేసులో వాంగ్మూలం ఇవ్వనందుకు వైఎస్ జగన్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. రిట్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత వాంగ్మూలం ఇస్తానని జగన్‌ తెలిపారు. తన లాయర్ ద్వారా జగన్ తన సమాధానాన్ని పంపారు. ఈ నెల 27న హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ విచారణకు రానుంది.
Samayam Telugu YS Jagan Case


కాగా, విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి తర్వాత పోలీసులకు జగన్ వాగ్మూలం ఇచ్చేందుకు నిరాకరించారు. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న జగన్‌ను ఏపీ పోలీసులు కలిసి వాగ్మూలం ఇవ్వాలని కోరారు. తనకు ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ అప్పుడు కూడా వాంగ్మూలం ఇచ్చేందుకు వైసీపీ నేత నిరాకరించారు. తర్వాత కూడా సిట్ వాంగ్మూలం కోసం ప్రయత్నాలు చేసింది. దాడి ఘటనలో కీలక సాక్ష్యమైన షర్ట్‌ (చొక్కా)ను నవంబర్ 23 ఉదయం 11 గంటలలోపు అందజేయాలని విశాఖ ఏడో మెట్రో పాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జగన్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

కాగా, కత్తిదాడితో కొన్ని రోజుల పాటు డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకున్న వైఎస్ జగన్.. కొన్ని రోజుల కిందట ప్రజాసంకల్పయాత్రను మళ్లీ ప్రారంభించారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. చివరగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.