యాప్నగరం

జాతీయ జెండాను ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌

లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో పార్టీ కార్యలయంలో సందడి నెలకొంది.

Samayam Telugu 26 Jan 2019, 12:54 pm

ప్రధానాంశాలు:

  • లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో పతావిష్కరణ
  • పెద్ద సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagan
హైదరాబాద్‌లోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో 70వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ వేడుకల్లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ..'తెలుగువారందరి ఇంటా భోగభాగ్యాలూ సిరిసంపదలూ సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ వర్ధిల్లాలని, ఎంతో గొప్పవైన మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం నిలవాలని నిండు మనసుతో కోరుకుంటూ... అందరికీ సంక్రాంతి శుభాక్షాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.