యాప్నగరం

మేం పదిసార్లకు పైనే అవిశ్వాసం నోటీసులిచ్చాం!

రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము పది సార్లకు పైనే అవిశ్వాస తీర్మానం నోటీసులు

Samayam Telugu 18 Jul 2018, 10:19 pm
రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో మోసం చేసిన మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ తాము పది సార్లకు పైనే అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అయితే తాము నోటీసులు ఇచ్చినప్పుడు అవిశ్వాసంపై చర్చ జరగకుండా చూశారని, అదే తెలుగుదేశం పార్టీ నోటీసులు ఇవ్వగానే అవిశ్వాస తీర్మానంపై చర్చ అంటున్నారని.. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉందని జగన్ అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో జగన్ మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలు కలిసే డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు.
Samayam Telugu jagan_kakinada


తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని తాము లోక్‌సభ స్పీకర్‌కు చాలా సార్లు ఫిర్యాదు చేశామని, అయితే ఆమెను వైసీపీ ప్రతినిధిగా అఖిలపక్ష సమావేశానికి పిలిచారని.. ఈ విధంగా బీజేపీతో లోలోపల డ్రామాలు చేస్తూ, బయటకు మాత్రం పోరాడినట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని జగన్ ఆరోపించారు.

తమ పార్టీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న లక్షా నలభై రెండు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్ అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా ఈ నియామకాలను క్రమం తప్పకుండా చేపడతామని జగన్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ ప్రజలు 25 ఎంపీ సీట్లను ఇస్తే రాష్ట్రానికి ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే వారికే కేంద్రంలో మద్దతు పలుకుతామని జగన్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.