యాప్నగరం

మరో నియోజకవర్గాన్ని దాటిన వైఎస్ జగన్

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

TNN 18 Nov 2017, 3:45 pm
ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గాన్ని దాటుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం చేరారు. ఈ రోజు సాయంత్రం కోవెలకుంట్ల వద్ద జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముగియనుంది.. నేటితో ప్రజా సంకల్పయాత్ర 11 రోజులను పూర్తి చేసుకుంటుంది. శనివారం ఉదయం ఆళ్లగడ్డ నియోజకవర్గం దొర్నిపాడు వద్ద జగన్ పాదయాత్ర ఆరంభం అయ్యింది.
Samayam Telugu ys jagan mohan reddy padayatra in kurnool district
మరో నియోజకవర్గాన్ని దాటిన వైఎస్ జగన్


కర్నూలు జిల్లాలో రెండో నియోజకవర్గంలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ పాదయాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. సామాన్య ప్రజానీకం తమ కష్టాలు చెప్పుకొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.