యాప్నగరం

YS Jagan: కేరాఫ్ కంచరపాలెం

ఇటీవలే వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమా ఆకట్టుకొంటూ ఉండటం, ఇదే సమయంలో కంచరపాలెం సెంటర్లో జగన్ సభ సూపర్ హిట్ కావడం ఆసక్తిదాయకంగా మారింది.

Samayam Telugu 10 Sep 2018, 1:47 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశాఖ జిల్లాలో అనూహ్య స్పందన కనిపిస్తోంది. జగన్ పార్టీ ఈ జిల్లాలో అంత బలంగా లేదు.. అనే విశ్లేషణలు మొన్నటి వరకూ వినిపిస్తూ వచ్చాయి. అయితే ఆ విశ్లేషణలకు భిన్నంగా జగన్ పాదయాత్రకు విశాఖ జిల్లాలో జనస్పందన కనిపిస్తూ ఉండటం విశేషం. ప్రత్యేకించి వైజాగ్‌లోని కంచరపాలెంలో వైసీపీ నిర్వహించిన సభకు విపరీత స్థాయిలో జనం రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Samayam Telugu 12


ఇటీవలే వచ్చిన కేరాఫ్ కంచరపాలెం సినిమా ఆకట్టుకొంటూ ఉండటం, ఇదే సమయంలో కంచరపాలెం సెంటర్లో జగన్ సభ సూపర్ హిట్ కావడం ఆసక్తిదాయకంగా మారింది.

ఇక విశాఖ పాదయాత్రలో జగన్ తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడుతూ, వివిధ వర్గాలకు హామీలు ఇస్తూ, వారి వినతులు స్వీకరిస్తూ సాగుతున్నారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నలను జగన్ తన ప్రసంగాల్లో ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తిపై కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత విమర్శలు చేస్తున్నారు.

తనవి కాని భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మంత్రి గంటా వందల కోట్ల రూపాయల రుణాలను తీసుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఇక వైఎస్ హయాంలో పేదలకు కేటాయించిన భూములను చంద్రబాబు నాయుడు తన సమీప బంధువు మూర్తికి కట్టబెట్టారని ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు భూ సేకరణ విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు భూములను మినహాయించి సామాన్యుల భూములను మాత్రం లాక్కొంటున్నారని విమర్శించారు. ఇలా భూములతో వ్యాపారం చేసిన నేతలెవరూ లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు.

జగన్ పాదయాత్ర ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.