యాప్నగరం

జగన్ సంచలన ప్రకటన: అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం

వైఎస్‌ఆర్ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాల్లో సంచలన ప్రకటన చేశారు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి.

TNN 9 Jul 2017, 5:11 pm
అమరావతి: వైఎస్‌ఆర్ పార్టీ మూడో ప్లీనరీ సమావేశాల్లో సంచలన ప్రకటన చేశారు పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్ ఈ ప్లీనరీ సమావేశాల్లో తొమ్మిది ప్రకటనలు చేసి వైఎస్ఆర్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. వీటిలో చివరిదిగా.. అధికారంలోకి రాగానే మూడు దశల్లో పూర్తి మద్యపాన నిషేదం చేస్తానని సంచలన ప్రకటన చేశారు జగన్. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపుతామని.. రెండో దశలో మద్యపానం వలన కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వం తరపున క్యాంపైన్ నిర్వహిస్తామని.. చివరి దశలో మద్యంరేట్లను విపరీతంగా పెంచి కేవలం ఫైవ్ స్టార్, బార్‌లలో లభించే విధంగా చేస్తామని వాటివల్ల ఎక్కువ డబ్బు ఉన్న వాళ్లు మాత్రమే మద్యాన్ని తాగుతారని.. ఒకవేళ ఆరోగ్యం పాడైనా అమెరికా వెళ్లైనా వారు ట్రీట్ మెంట్ తీసుకోగరని అన్నారు.
Samayam Telugu ys jagan mohan reddy sensational decision at ysrcp plenary
జగన్ సంచలన ప్రకటన: అధికారంలోకి వస్తే మద్యపాన నిషేదం


అయితే తాను తీసుకున్న ఈ తాజా సంచలన నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడినా పర్లేదని.. నిరుపేద కుటుంబాలు ఈ మద్యపానం వల్ల రోడ్డున పడుతున్నాయని వారిని ఆదుకోవడం కోసం తానీ ప్రకటన చేసినట్లు తెలిపారు జగన్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.