యాప్నగరం

వైఎస్సార్ అభిమానులారా.. మనకు దేవుడున్నాడు: జగన్

తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని అతి దారుణంగా హత్య చేశారని, తలపై ఐదుసార్లు నరికారని వైఎస్ జగన్ తెలిపారు. సంయమనం పాటించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Samayam Telugu 16 Mar 2019, 7:09 am
న చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయడం రాజకీయంగా అత్యంత నీచమైన చర్య అని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన, అత్యంత సౌమ్యుడిగా పేరున్న మాజీ ఎంపీని అత్యంత దారుణంగా హత్య చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన చిన్నాన్నను హత్య చేశారని.. తలపై ఐదు చోట్ల గొడ్డలితో నరికారని తెలిపారు. వివేకా భౌతికకాయానికి నివాళి అర్పించిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు. అభిమానులు ఆవేశానికి లోను కావొద్దని.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu ysrcp


‘మనకు దేవుడు ఉన్నాడు. దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. అన్యాయం చేసినోళ్లను ఆయన చూస్తాడు.. వైఎస్సార్ అభిమానులకు మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఘటన ద్వారా రెచ్చిపోయి ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడొద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నా..’ అని జగన్ పిలుపునిచ్చారు..

రాష్ట్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని జగన్ అన్నారు. ‘మా నాన్నను కట్టడి చేయడం కోసం తాతను చంపారు. తాతను చంపిన సమయంలో సీఎం చంద్రబాబే. ఇక నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదానికి రెండు రోజుల ముందు అసెంబ్లీకి ఎలా వస్తావని చంద్రబాబు నిండు సభలో సవాల్‌ చేశారు. ఇటీవల విశాఖ విమానాశ్రయంలో, ఎవరూ వెళ్లలేని ప్రాంతంలో నన్ను చంపాలని చూశారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్‌ వేస్తే ఎలా?’ అని జగన్ ప్రశ్నించారు.

చదవండి: మూడుసార్లు దారుణాలు, ఉన్నది ఒకే వ్యక్తి.. వైెఎస్ జగన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.