యాప్నగరం

‘టీడీపీ వైఎస్సార్సీపీని అనుసరించాల్సిందే!’

రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించే పోరాటంలో తెలుగుదేశం పార్టీ కూడా చివరకు తమను ఫాలో కావాల్సిందే

Samayam Telugu 16 Mar 2018, 5:33 pm
రాష్ట్రానికి ప్రత్యేకహోదాను సాధించే పోరాటంలో తెలుగుదేశం పార్టీ కూడా చివరకు తమను ఫాలో కావాల్సిందే అని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు జగన్ ట్వీట్ చేశారు.
Samayam Telugu ys jagan mohan reddy tweets on ap spl status
‘టీడీపీ వైఎస్సార్సీపీని అనుసరించాల్సిందే!’


‘ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో ప్రజల మద్దతుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తోంది, ఇప్పుడు ఈ విషయంలో జాతి మేల్కొంది. చంద్రబాబు నాయుడు కూడా మేల్కొన్నారు.

రాజకీయాలు ఎలా ఉన్నా.. తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకాల్సిందే. ఇది ప్రజాస్వామ్య విజయం, ఏపీ ప్రజల విజయం. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుంది. ’ అని జగన్ ట్విటర్ లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.