అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళకు జైలు శిక్ష పడిన నేపపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహర్ రెడ్డికి కూడా అదే శిక్ష పడక తప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
‘‘అక్రమాస్తుల కేసులో శశికళ..20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లింది. రూ.40వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్ కూడా జైలుకు వెళ్లాల్సిందే’’ అని చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.
శ్రీశైలం మిగుల జలాలను రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వినియోగిస్తామని ఈ సందర్భంగా బాబు అన్నారు.
‘‘అక్రమాస్తుల కేసులో శశికళ..20 ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లింది. రూ.40వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన జగన్ కూడా జైలుకు వెళ్లాల్సిందే’’ అని చంద్రబాబు అన్నారు. గురువారం ఆయన చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం కుప్పం పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు.
శ్రీశైలం మిగుల జలాలను రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వినియోగిస్తామని ఈ సందర్భంగా బాబు అన్నారు.