యాప్నగరం

కర్నూలు జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 17వ రోజున కర్నూలు జిల్లాలో సాగుతోంది

TNN 25 Nov 2017, 11:20 am
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 17వ రోజున కర్నూలు జిల్లాలో సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తికొండ నియోజకవర్గంలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర సాగుతోంది. శుక్రవారం జగన్ పాదయాత్రకు విరామం కాగా.. శనివారం ఉదయం యాత్ర పున:ప్రారంభం అయ్యింది.
Samayam Telugu ys jagan padayatra on 17th day
కర్నూలు జిల్లాలో సాగుతున్న జగన్ పాదయాత్ర


పదహారవ రోజుతో జగన్ మోహన్ రెడ్డి 225 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. శనివారం రోజున జగన్ యాత్ర వెల్దుర్తి నుంచి ప్రారంభం అయ్యింది. అక్కడి నుంచి వెల్దుర్తి, చెరుకులపాడు, పుట్లూరు క్రాస్‌, తొగరచేడు క్రాస్‌ వద్దకు చేరుకుంటారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం ఆరున్నరకు జగన్ రామకృష్ణపురం చేరుకుంటారని..ఈ రాత్రికి అక్కడే జగన్ బస చేస్తారని పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.