యాప్నగరం

జగన్ మోహన్ రెడ్డి.. వందో నియోజకవర్గంలోకి!

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వందో నియోజకవర్గంలోకి ఎంటరయ్యారు.

Samayam Telugu 28 Jul 2018, 9:49 pm
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వందో నియోజకవర్గంలోకి ఎంటరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డి వందో నియోజకవర్గంలో ప్రవేశించారు. గత ఏడాది అక్టోబర్ నెలలో జగన్ పాదయాత్ర మొదలైన సంగతి తెలిసిందే.
Samayam Telugu YSJ_100ni


తను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టారు. అనంతరం కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. రాయలసీమను దాటేశాకా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలను దాటేసి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు జగన్.

పై జిల్లాల్లోని మెజారిటీ నియోజకవర్గాలను టచ్ చేస్తూ జగన్ పాదయాత్ర సాగింది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర వందో నియోజకవర్గాన్ని చేరుకుంది.

ఇదిలా ఉంటే.. రేపు జగ్గంపేటలోనే జగన్ మోహన్ రెడ్డికి పార్టీ ముఖ్యులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ చార్జిలు ఇతర హోదాల్లోని ముఖ్యనేతలంతా పాల్గొననున్నట్టుగా తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.