యాప్నగరం

చేపల చెరువులో వల వేసిన జగన్

పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్రను సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్కడి ఆక్వా రైతులతో మమేకం అయ్యారు.

Samayam Telugu 25 May 2018, 2:41 pm
పశ్చిమగోదావరి జిల్లాలో పాదయాత్రను సాగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అక్కడి ఆక్వా రైతులతో మమేకం అయ్యారు. వారితో మాట్లాడి కష్టనష్టాలను తెలుసుకున్నారు. ఇందులో భాగంగా జగన్ మోహన్ రెడ్డి మార్గమధ్యంలో పెదకాపవరం శివార్లలో ఒక చేపల చెరువు వద్ద ఆక్వా రైతులతో మాట్లాడారు. తాము దళారుల వల్ల నష్టపోతున్నామని, వ్యాపారస్తులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు తమతో కొనుగోలు చేస్తున్నారని వారు వాపోయారు. ఈ వ్యాపారస్తుల సిండికేట్‌‌లో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ది ముఖ్య పాత్ర అని రైతులు జగన్‌కు చెప్పారు.
Samayam Telugu jagan_aq


ఈ సందర్భంగా ఆక్వా రైతులకు జగన్ పలు హామీలను ఇచ్చారు. తమ ప్రభుత్వం వస్తే రైతులకు దళారులతో ఇబ్బంది లేకుండా చూస్తామని, ఆక్వా రైతుల కోసం కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర వచ్చేంత వరకూ రైతులు రొయ్యలను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకోవచ్చని అన్నారు. ఆక్వా రైతులకు కరెంట్ బిల్స్‌ను తగ్గిస్తామని, యూనిట్ కు 4.75 పైసల నుంచి 1.50 పైసలకు తగ్గిస్తామని జగన్ వారికి హామీ ఇచ్చారు.

ఆక్వా రైతులతో మమేకం అయిన జగన్ చెరువు నుంచి చేపలను, రొయ్యలను పట్టడం ఎలాగో అడిగి తెలుసుకున్నారు. వల విసరడంలో ఒడుపు ఎలాగో అడిగారు. సరదా చెరువులోకి వల వేశారు. ఆ సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కేరింతలు కొట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.