యాప్నగరం

జగన్ నన్ను చంపించాలని చూస్తున్నాడు!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను చంపించాలని చూస్తున్నాడని

TNN 16 Aug 2017, 1:00 pm
ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను చంపించాలని చూస్తున్నాడని ఆది వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నిక వేడి మధ్య ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. దళితుల విషయంలో అనుచిత వ్యాఖ్యానాలు చేశాడని ఆదినారాయణ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతపై విమర్శలు గుప్పించారు. జగన్ తనను చంపించాలని చూస్తున్నాడు.. అని వ్యాఖ్యానించారు.
Samayam Telugu ys jagan plan to kill me said minister aadinarayana reddy
జగన్ నన్ను చంపించాలని చూస్తున్నాడు!


జమ్మలమడుగులోని ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రిగారు మాట్లాడుతూ.. దళితులపై అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. దళితులు సరిగా చదవరని, శుభ్రంగా ఉండరని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఆ వ్యాఖ్యలు చేసిన ఆదినారాయణ రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆది స్పందించారు. తను ఎలాంటి అనుచిత వ్యాఖ్యానాలూ చేయలేదని ఈయన చెప్పారు.

తను దళితులను అవమానించలేదన్నారు. అలాగే తమ పార్టీ అధినేత చంద్రబాబు దళితులను అవమానించారనేది కూడా అబద్ధమే అని ఆది చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ.. తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆది వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను చంపించాలని చూస్తున్నారని ఆది అన్నారు. కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని తను ఓడించాను అని, అందుకే జగన్ తనను చంపించాలని చూస్తున్నాడని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బాధ్యతల్లో కూడా ఆది క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యానాలు రాజకీయంగా మరింత వేడిని రాజేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.