యాప్నగరం

రేపటి నుంచి జగన్ యాత్ర పునఃప్రారంభం

పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని డాక్టర్లు జగన్‌కు తెలిపారు.

Samayam Telugu 11 Nov 2018, 6:07 pm
ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం (నవంబరు 12) నుంచి పునఃప్రారంభం కానుంది. అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిలో గాయపడిన జగన్.. పాదయాత్రకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నందున సోమవారం నుంచి తిరిగి పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘరాం తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని మక్కువ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమవ్వనుందని తెలిపారు.
Samayam Telugu ys jagan


అయితే పాదయాత్ర సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ చేతిని ఎవరూ తాకకుండా చూసుకోవాలని, సాధ్యమైనంత వరకూ ఆ చేతిని పైకి లేపే ప్రయత్నం చేయవద్దని డాక్టర్లు జగన్‌కు తెలిపారు. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే గాయం పూర్తిగా మానేందుకు సమయం పడుతుందని వారు హెచ్చరించారు.

వైఎస్‌ జగన్‌ ఇప్పటి వరకు వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. అనంతరం విజయనగరం జిల్లా శృంగవరపుకోట, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి నియోజకవర్గాల్లో పాదయాత్ర పూర్తిచేసి సాలూరు నియోజకవర్గంలో ఉన్నారు. ఈ జిల్లాలో ఇంకా పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాలు మిగిలి ఉన్నాయి. ఇవి పూర్తయ్యాక చివరి జిల్లాగా శ్రీకాకుళంలో ప్రవేశిస్తారు. జగన్ 'ప్రజా సంకల్పయాత్ర నవంబరు 6తో ఏడాది పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో జగన్‌ 3,211.5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.